కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తలపతి విజయ్ ఇప్పటికే ఈ సంవత్సరం బీస్ట్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తలపతి విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత తలపతి విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 67 వ మూవీ గా రూపొందుతుంది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో , వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత తలపతి విజయ్ "లవ్ టు డే" మూవీ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ , తలపతి విజయ్ కి ఓ స్టోరీ చెప్పడం ... విజయ్ ఆ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్ని జరిగిపోయినట్లు కోలీవుడ్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే లవ్ టుడే మూవీ కి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ,  ఈ మూవీ లో హీరో గా కూడా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: