టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ కుడుముల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ దర్శకుడు ఛలో , భీష్మ మూవీ ల విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను కలిగిన దర్శకుల్లో ఒకరిగా మారిపోయాడు . ఈ దర్శకుడు కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరో గా ఒక మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు . కాక పోతే కొన్ని అని వార్య కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి  , వెంకి కుడుముల మూవీ ఆగిపోయింది . దానితో ఈ యంగ్ డైరెక్టర్ నితిన్ హీరో గా ఒక మూవీ ని తెరకెక్కించ డానికి ప్లాన్స్ చేస్తున్నాడు . అందులో భాగంగా ఇప్పటికే నితిన్ కు ఒక కథను వినిపించ గా , నితిన్ కూడా వెంకీ కుడుముల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. నితిన్ హీరో గా వెంకి కుడుముల తెరకెక్కించ బోయే మూవీ కథ ఇదే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఓ ప్రాణాంతకమైన డిసీజ్ తో చావుకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి కథ తో వెంకీ కుడుముల నితిన్ తో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే నితిన్ మరియు వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ మూవీ తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానితో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: