
ప్రస్తుతం రీ రిలీజ్ మూవీల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ ట్రెండు సెట్ చేసింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులనే చెప్పాలి . ఆయన పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసి కొత్త ట్రెండ్ కి పునాది వేశారు. ఇప్పుడు ఇదే ట్రెండు చాలామంది హీరోలు, దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిరంజీవిని మొదులుకొని బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ , రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న ఒక్కడు సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 7వ తేదీన రీ రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతుండడంతో అభిమానుల ఆనందాలకు అవధులు లేవు. ఇకపోతే మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో పాన్ ఇండియా లెవెల్ లో యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.