మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమాలో బ్యాలెన్స్ సాంగ్స్‌ను షూట్ చేసేందుకు ప్రస్తుతం చిత్ర యూనిట్ ఫ్రాన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు బాబీ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తరువాత ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు..


ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్, బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాల ను అమాంతం పెంచేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా కు సంబంధించిన రెండో సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా ను సంక్రాంతి బరి లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించగా, తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది..


వాల్తేరు వీరయ్య చిత్ర రన్‌టైమ్‌ను 2 గంటల 35 నిమిషాలు గా ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్. ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి ఇది మంచి రన్‌టైమ్ అని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక మెగాస్టార్ మాస్ అవతారం లో వస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్ర లో నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ వర్గాల తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రాని కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: