ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రం లాఠీ.. తమిళ్ లో లత్తి పేరిట ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. హై వోల్టేజ్ స్టాండ్స్ తో కూడిన యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలకు పేరుగాంచిన విశాల్ అతని మాస్ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ పొందాయనే చెప్పాలి . అయితే ఈ మధ్యకాలంలో ఈయన తెరకెక్కిస్తున్న చాలా సినిమాలు అభిమానులను నిరాశ పరుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చివరిగా 2018 లో అభిమన్యుడు సినిమా చేయగా ఈ సినిమా కమర్షియల్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత విడుదలైన ఆర్య , సామాన్యుడు సినిమాలు పూర్తి స్థాయిలో నిరాశపరిచాయి.


ఇప్పుడు మరొకసారి లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఇందులో కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు విశాల్. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను లాఠీతో కొట్టడంలో దిట్టంగా చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టైలర్ విడుదల చేయగా విపరీతంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఇందులో విశాల్ భార్యగా సునయన నటిస్తోంది. ఇకపోతే పరిమిత అధికారులు కలిగిన నిజాయితీగల కానిస్టేబుల్ క్రూరమైన విలన్లను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు యాక్షన్ సన్నివేశాలతో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ ట్రైలర్ లో మనం చూడవచ్చు.

విశాల్ స్నేహితులు రమణా, నంద.. రాణా ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు.ఇదిలా ఉండగా డిసెంబర్ 22వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ను శరవేగంగా చేపడుతున్నారు.  ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ఈరోజు బెంగళూరులో జరపబోతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. మొత్తానికైతే ట్రైలర్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు విశాల్. త్వరలోనే తెలుగులో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: