టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకవైపు సౌత్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. ముందుగా బాలీవుడ్ లో నటించి టాలీవుడ్ కి వచ్చినప్పుటికి అక్కడ హిందీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది రష్మిక మందన.అయితే బాలీవుడ్ లో అయినా ఇప్పుడు ఈమెకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఈమె యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కు జోడిగా నటిస్తుంది.

దీంతో పాటు మరో భారీ సినిమాలో కూడా అవకాశాన్ని రష్మిక మందన దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రాజమౌళి తర్వాత అంతటి రేంజ్ గుర్తింపును పొందిన దర్శకుడు సంజయ్ భన్సాలి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక భారీ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా చేయనున్నట్లు బాలీవుడ్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం ఇటీవల ఈమె ముంబైలోని సంజయ్ లీలా బన్సాలి ఆఫీస్ నుండి బయటకు వస్తున్న ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.దీంతో సంజయ్ లీలా బన్సాలి సినిమాలో రష్మిక మందన నటించనుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయితున్నప్పటికీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈమె తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టు సినిమాలో నటిస్తోంది. దీని అనంతరం మరో రెండు సినిమాలు చేయనున్నట్లుగా తెలుస్తోంది .ఈ నేపథ్యంలోనే రష్మిక మందన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి తనకి ఆఫర్లు వచ్చినప్పటికీ పట్టించుకోవట్లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె దృష్టి  మొత్తం బాలీవుడ్ పైనే పెట్టినట్లుగా సమాచారం. ఇప్పటికైనా రష్మిక మందనకి బాలీవుడ్ లో మంచి సక్సెస్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: