జబర్దస్త్ షో పుణ్యమా అని చాలామంది కమెడియన్ లో స్టార్ కమెడియన్లుగా మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా స్టార్ కమెడియన్స్ గా గుర్తింపు పొందిన చాలా మంది కమీడియన్స్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. ఇక మరికొందరు బుల్లితెరపై సందడి చేస్తూ ఉన్నారు. కానీ మరికొందరు మాత్రం స్టార్ హీరోలు అయ్యారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకరు. అయితే వీటితోపాటు హైపర్ ఆది మరియు గెటప్ శ్రీనులో కూడా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ ముగ్గురిలో సుడిగాలి సుదీర్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

గెటప్ శీను మాత్రం చాలా రోజులుగా సినిమాల్లో చేస్తూ బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోల సరసన నటిస్తున్నాడు గెటప్ శ్రీను. అయితే గెటప్ శ్రీను జబర్దస్త్ షోలో గత కొన్ని నెలలుగా కనిపించడం లేదు. అయితే ఎట్టకేలకు తాజాగా మళ్లీ జబర్దస్త్ షో కి రాంప్రసాద్ స్కిట్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు గెటప్ శ్రీను. అయితే గెటప్ శ్రీను కి మల్లెమాలవారు ఇచ్చే పారితోషకం కంటే సినిమాల్లో ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ.అయినప్పటికీ జబర్దస్త్ షోలో చేయాలి అని భావించి జబర్దస్త్  రీ ఎంట్రీ ఇచ్చాడు గెటప్ శ్రీను. ఈ నేపథ్యంలోనే గెటప్ శ్రీను మల్లెమాల వారిని కాస్త రెమ్యూనరేషన్ పెంచండి అని డిమాండ్ చేయడంతో మల్లెమాలవారు ఒప్పుకోలేదు అని తెలుస్తుంది.

అంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం మా వల్ల కాదు అంటూ గౌరవంగానే గెటప్ శ్రీను ని మల్లెమాల నుండి పంపించేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే గెటప్ శ్రీను శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఇతర షోలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జబర్దస్త్ కాకుండా మల్లెమాలవారు నిర్వహించే ప్రత్యేక షోలకి కూడా గెటప్ శ్రీనుని పిలుస్తామని చెప్పడంతో గెటప్ శ్రీను కూడా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాల ద్వారా జబర్దస్త్ షో కి గ్యాప్ ఇచ్చిన గెటప్ శ్రీను రీఎంట్రీ ఇచ్చిన వెంటనే బయటకు వెళ్లిపోవడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే దీనికి కారణం కేవలం రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: