టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా శాకుంతల సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరిలో విడుదలకానుంది. అయితే ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. అయితే గత కొంతకాలంగా సమంత ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ సినిమాలపై తనకి ఉన్న ఇష్టం అభిమానంతో ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో పాల్గొంటుంది సుమంత. 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు సమంత. అయితే ఇందులో భాగంగానే కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్. అయితే ఈ సినిమా స్టోరీ రాసుకున్న సమయంలో మొదటగా ఈ సినిమాలో నయనతార నటిస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారట ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్. ఇక దానికోసం అన్ని సిద్ధం చేసుకున్నారట. అయితే నయనతార ని ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నప్పటికీ తన కుమార్తె వల్ల నయనతార స్థానంలో సమంత వచ్చిందట.

 ఈ విషయాన్ని తాజాగా ఓ సందర్భంలో తెలియజేశారు డైరెక్టర్ గుణశేఖర్. అయితే ఈ సినిమాకి సంబంధించిన కథను పూర్తి చేసుకున్న సమయంలో తన కూతురు ఈ సినిమాకి సమంత అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది అని సలహా ఇవ్వడంతో గుణశేఖర్ తన కూతురు మాట విని సమంతని ఈ సినిమాలో పెట్టుకున్నాడట డైరెక్టర్ గుణశేఖర్. అయితే సమంత చాలా మోడరన్ గా ఉన్నప్పటికీ గతంలో ఆమె రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే శాకుంతలం సినిమాలో కూడా సమంత బాగా నటిస్తుంది అన్న ధైర్యంతో ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ సుమంత్ ని ఈ సినిమాలో ఫైనల్ చేశారు అని తెలుస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: