ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షో వేయగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. అంతేకాదు సెన్సార్ బోర్డు పూర్తి చేసుకున్నప్పుడు కూడా 3.5 రేటింగ్ సొంతం చేసుకోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ మాస్ హిట్ అయ్యేలాగా కనిపిస్తోంది అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
బాక్స్ ఆఫీస్ వద్ద వీరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ ఓపెనింగ్ రోజున రాబడుతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈరోజు థియేటర్లలో ప్రదర్శించబడుతోంది కాబట్టి ఈరోజు టోటల్ కలెక్షన్స్ తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. ఇకపోతే అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అని సమాచారం. ఏది ఏమైనా ఈ వయసులో కూడా ఈయన పక్కా మాస్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ ఉండడం విశేషం.