సాధారణంగా తినే ప్రతి మెతుకు మీద తమ పేరు రాసి ఉండాలి అని అంటూ ఉంటారు. ఇదే విధంగా సినీ రంగంలో కూడా హీరోల దగ్గరికి వచ్చే కథలపై కూడా వారి పేరు రాసి పెట్టి ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు. ఇక ఇలా ఒక హీరో కోసం అనుకున్న కదా మరో హీరో దగ్గరకు వెళ్లి ఆ హీరోసినిమా చేయడంతో ఆ సినిమాలో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా మరో హీరో దగ్గరికి వెళ్లిన సినిమాలో తిరుగులేని విజయాన్ని సాధిస్తాయి. ఇక అలాంటి సినిమాలలో క్రాక్ సినిమా కూడా ఒకటి. గోపీచంద్ మలినేని  దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయమందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గోపీచంద్  మొదట ఈ సినిమాని బాలకృష్ణతో తీయాలని భావించాడట. ఈ సినిమాకి నిర్మాత గా  కళ్యాణ్ కూడా ఫిక్స్ అయ్యాడు. 

గోపీచంద్ ఈ సినిమాని చేయాలి అనుకున్న సమయంలో బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దీంతో గోపీచంద్ మాస్ మహారాజ్ రవితేజతో ఈ సినిమా లో ఫిక్స్ చేశాడు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు పూర్తయింది అయినప్పటికీ ఈ సినిమాను చూసేందుకు అంత ఆసక్తి చూపుతారు సినీ అభిమానులు. ఇక రవితేజ కెరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ విషయాన్ని తాజాగా ఈ సినిమా నిర్మాత  కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే తాజాగా గోపీచంద్ మరియు నిర్మాత  కళ్యాణ్ ఫంక్షన్ కు గెస్ట్లుగా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా కళ్యాణ్ గోపీచంద్ గురించి మాట్లాడుతూ మా ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉంది..

కానీ కొన్ని కారణాలవల్ల అది కుదరలేదు. మొన్న బాలకృష్ణతో గోపి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. నిజంగా చెప్పాలి అంటే ఈ కాంబినేషన్లో సినిమా నేను చేయాల్సింది. కానీ అది నాకు రాసి పెట్టలేదు. అది మరొకరికి రాసిపెట్టి ఉంది. గతంలో క్రాక్ సినిమాను బాలకృష్ణతో తీయాలని అనుకున్నాం. కానీ ఆ సమయంలో బాలయ్య డేట్స్ కుదరలేదు. అలా క్రాక్ సినిమా బాలయ్య మిస్సయ్యాడు అంటూ చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో అందరూ దర్శక నిర్మాతలు సినిమాలు విడుదల చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో క్రాక్ సినిమా ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది అనడంలో ఇలాంటి సందేహం లేదు. అప్పట్లో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. రవితేజ కి ఎన్నో ఏళ్లుగా సరైన హిట్టు లేక బాధపడుతున్న సమయంలో ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: