టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రెసెంట్ బాలయ్య బాబు వరుస హిట్ సినిమాల్తో ఫుల్ ఫామ్ ఉన్నాడు. దాంతో స్టార్ డైరెక్టర్లు సైతం వరుసగా ఈయనతో మూవీస్ చేయాలని పోటీ పడుతున్నారు.ఈ మధ్యనే సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి మూవీ తో వచ్చి ఇంకొక హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు.ఈ మూవీ ని యాక్షన్ డైరెక్టర్ ఐనా గోపీచంద్ మలినేని తీసాడు. సంక్రాంతి కానుకగా వచ్చి న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దీంతో అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోయింది అని అటు వైపు బాలయ్య మరియు  నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.
అందుకే ప్రెసెంట్ ఓటిటీలో విడుదల అయ్యేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఐతే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ గురించి ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి దాంట్లో భాగంగానే తాజాగా మేకర్స్ నే అఫిషియల్ గా ప్రకటించారు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ కూడా ఇచ్చారు.

ఐతే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి నెల లో 23 వ తారీఖు నుండి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు చెప్పారు. ఐతే అఫిషియల్ అప్డేట్ రావడంతో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తెలుతున్నారు. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ లో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో దునియా విజయ్ విలన్ రోల్ లో చేయగా అతని భార్యగా  వరలక్ష్మి శరత్ కుమార్ ఒక మెయిన్ రోల్ చేసి మంచి గుర్తింపు సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: