తెలుగు చిత్ర పరిశ్రమల్లో మెగాస్టార్ చిరు కి ఉన్న ఫాలోయింగ్ గూర్చి ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. ఆయనకి ఇద్దరు కూతుళ్లు మరియు ఒకరు కొడుకు. ఐతే కొడుకైనా రాంచరణ్ యొక్క ప్రెసెంట్ స్టేజ్ గూర్చి చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఆయన పెద్ద కూతురైనా సుస్మిత కొణిదెల ప్రెసెంట్ ఒక చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆ చిత్రం నుండి ఒక సాంగ్ రిలీజ్ చేసారు.''చిట పటమని కసిరితే, గుసగుసమని నసిగితే.. పొగరంతా కరిగేలా ర్యాంపాడిస్తా' అని ఒక అమ్మాయిపై ఒక అబ్బాయి చిటపట మంటున్నాడు. ఐతే ఇక ఆ అమ్మాయి ఊరుకుంటుందా? 'తల బిరుసుతో ఎగిరితే, మగ బలుపిక ముదిరితే, మొహమాటం పడకుండా రఫాడిస్తా' అంటూ రఫ్‌గా సమాధానం ఇస్తుందమ్మాయి.

ఈ విధంగా అబ్బాయి.. అమ్మాయి మాటలతో కాదు ఏకంగా పాటలతోనే గొడవలు పడుతున్నారు. ఐతే అసలు వీళ్ల గొడవకి రీసన్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం మనం ఈనెల పద్దెనిమిది న విడుదల  అవుతున్న 'శ్రీదేవి శోభన్‌బాబు' మూవీ విక్షించాల్సిందే అని అంటున్నారు గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేతలు విష్ణు ప్రసాద్‌ మరియు సుస్మిత కొణిదెల.

ఐతే ఈ  శ్రీదేవి ఎవరు?, శోభన్‌బాబు ఎవరు? వారి మధ్య గొడవేంది? అనేది మాత్రం తెలియాలంటే తప్పకుండా మూవీ  చూడాల్సిందే. ఆ మూవీ లో శోభన్‌బాబుగా సంతోష్‌ శోభన్‌  శ్రీదేవిగా గౌరి జి కిషన్‌ చేసిన మూవీ 'శ్రీదేవి శోభన్‌బాబు'. దీనికి ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నాడు.ఐతే ఇటీవల మూవీ యూనిట్‌ ఈ సినిమా నుంచి 'టామ్‌ అండ్‌ జెర్రీ' లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. దీనికి కమ్రాన్‌ సంగీతంలో కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటను రేవంత్‌, సింధుజ శ్రీనివాసన్‌ పాడారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్  సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ మాట్లాడుతూ, మా మనసుకు ఎంతో దగ్గరైన మూవీ ఇది. ఇందులో మా అందరిలో ఉన్న ఇన్నోసెంట్‌ ఎమోషన్స్‌ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. సంతోష్‌ శోభన్‌, గౌరిలు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు.ఈ మూవీ మన పక్కింట్లో  జరిగేలాంటి నేెటివిటీ ఉన్న థీమ్ తో  ప్రశాంత్‌ మూవీ ను చిత్రికరించారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: