పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లకు ఓకే చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఈ విషయాన్ని ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడి గా యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించబోతున్నట్లు ... అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ శ్రీ లీల కు సంబంధించిన ఫోటో షూట్ ను కూడా నిర్వహించినట్లు మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను మార్చి 28 వ తేదీ నుండి ప్రారంభించడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా షూటింగ్ ను ప్రారంభించిన తర్వాత శర వేగంగా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి తేరి మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: