టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ కెరీర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే ... శ్రీ లీల ... మహేష్ సరసన హీరోయిన్ లుగా కనిపించనుండగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొన్ని షెడ్యూల్ ల షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ ని దర్శకుడు త్రివిక్రమ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో కూడిన సెంటిమెంట్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నప్పటికీ మెయిన్ గా ఈ సినిమాలో సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ లో సిస్టర్స్ సెంటిమెంట్ తో వచ్చే సన్నివేశాలు చాలా బలంగా వచ్చే విధంగా త్రివిక్రమ్మూవీ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అలా ఈ మూవీ లో సిస్టర్ సెంటిమెంట్ కు చాలా ప్రాధాన్యత ఉండటంతో ... ఈ మూవీ లో మహేష్ కు సిస్టర్ గా నటించబోయే నటి కూడా చాలా పాపులర్ అయిన వ్యక్తి ఉండాలి అని ఈ మూవీ యూనిట్ భావిస్తున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ లో మహేష్ కు సిస్టర్ గా సాయి పల్లవి ని తీసుకునే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు ... అందులో భాగంగా సాయి పల్లవి తో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ సంప్రదింపులను జరుపుతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉందో చూడాలి. ఒక వేళ ఈ వార్త కనుక నిజం అయ్యి సాయి పల్లవిమూవీ లో నటించిన అయితే ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: