యాంకర్ శ్రీముఖి గురించి ఈ మధ్యకాలంలో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతేకాదు అటు సినిమాలలో ఇటు సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారికి దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఏ ఈవెంట్లో చూసినా సరే ఏ షోలో చూసినా సరే ఎక్కువగా శ్రీముఖి కనిపిస్తోంది. ఒకవైపు వరుసగా షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమా అవకాశాలను అందుకుంటూ మరింతగా పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో సమయం దొరికితే చాలు వరుస గ్లామర్ ఫోటోషూట్లతో యువతను తన వైపు తిప్పు కుంటోంది.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న షో లలో మిస్టర్ అండ్ మిసెస్ కూడా ఒకటి. ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో ను విడుదల చేయగా ఈ ఎపిసోడ్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఇప్పటికే మిస్టర్ అండ్ మిస్సెస్ షోలో హీరో శివబాలాజీ హీరోయిన్ నేహా జడ్జిలు వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోని ఎపిసోడ్ నుంచి ప్రోమో విడుదల చేయగా ఈమధ్య కాలంలో పెళ్లితో ఒక్కటైన జబర్దస్త్ రాకేష్,  జోర్దార్ సుజాత జంట కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోని టాస్క్ ఆడే సమయంలో రాకింగ్ రాకేష్ కి శ్రీముఖి నవ్వుతూనే స్టేజ్ పై ఒక మాస్ వార్నింగ్ ఇచ్చింది.  లాస్ట్ లో భాగంగా దంపతులలో ఒకరు కళ్ళకు గంతులు కట్టుకుంటే మరొకరు బాలు వేస్తూ బాస్కెట్బాల్ పడేలా చేసి గోల్ చేయాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే రాకేష్ బాల్స్ వేస్తూ ఉంటే సుజాత పెట్టుకునే ప్రయత్నం చేసింది కానీ రెండుసార్లు స్టెప్పు పడిన బంతిని గోల్ చేసే ప్రయత్నం చేశాడు రాకేష్.  అప్పుడు వెంటనే శ్రీముఖి దగ్గరికి వెళ్లి అదేంటి రెండుసార్లు స్టెప్స్ పెడితే.. దొబ్బిందమ్మ టూ స్టెప్స్ లేవని ముందే చెప్పినా కదరా లఫూట్ అంటూ అందరి ముందే అవమానపరిచింది. అలాగే రాకేష్ శ్రీముఖి మీద చేయి వేయడంతో చేయి లేస్తోంది.. ఏందిరా .. మళ్లీ కాపురానికి పనికి రాకుండా పోతావు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులతో స్టేజ్ ను హోరెత్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: