యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లు ఏ రేంజ్ విజయాలను అందుకున్నాయో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ల ద్వారా యాష్ ... శ్రీ నిధి శెట్టి ... ప్రశాంత్ నీల్ ల క్రేజ్ అమాంతం ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇలా కే జి ఎఫ్ మూవీ లతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృధ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు చాప్టర్ 2 లు భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో కే జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ ని కూడా తలకెక్కించబోతున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా ఇందుకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం సలార్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్న.ప్రశాంత్ నీల్ ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఈ దర్శకుడు కే జీ ఎఫ్ చాప్టర్ 3 మూవీ ని మొదలు పెట్టనున్నట్లు ... అలాగే ఆ సినిమాను 2025 వ సంవత్సరంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: