రెబల్ స్టార్ ప్రభాస్ ,డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కే జి ఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న ప్రాజెక్టు కావడంతో దీనిపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా ఈ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్స్ను అందుకుంటుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే కేజిఎఫ్ సిరీస్ కంటే ఈ సినిమా ఖచ్చితంగా హై వోల్టేజ్ యాక్షన్స్ అన్ని వేషాలు ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.

ఇందులో విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు కూడా విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్నది. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ఇటలీలో జరగబోతోంది అని తెలుస్తోంది .ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 85% పూర్తి అయినట్లు సమాచారం. ఇటలీలో ఇంటరెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత తిరిగి హైదరాబాదులోని షూటింగ్ జరగబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ చిత్రంలో రాఖీ బాయ్ నటించబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్లో రాఖీ బాయ్ పాత్ర సలార్లో ప్రభాస్ ని కలుస్తుందని టాక్ వినిపిస్తోంది అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర బృందం కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఇవన్నీ వట్టి రూమర్సే అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరగబోతుందని తెలుస్తోంది. షూటింగ్ కూడా మెజారిటీ కంప్లీట్ కావడంతో ముందే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ఏడాది విడుదల కాబోతోంది. షూటింగ్ కంప్లీట్ అవ్వగానే విజువల్ ఎఫెక్ట్ వర్క్ మీద డైరెక్టర్ ప్రశాంత్ దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్-k సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: