టాలీవుడ్ యంగ్ అక్కినేని అఖిల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్'. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఎన్నో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.ఈ సినిమాను టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సూపర్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఇంకా ఓ పాట ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.ఇంకా ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రమోషన్స్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను త్వరలోనే నిర్వహించాలని మూవీ యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.


ఈ ఈవెంట్‌కు ఆర్ఆర్ఆర్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను కలిపి గెస్టులుగా పిలవాలని మూవీ యూనిట్ భావిస్తోందట.ఇక ఇద్దరు హీరోలు  నిజంగానే అఖిల్ ఏజెంట్ మూవీ కోసం వస్తే, నందమూరి మెగా అక్కినేని అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఒకే వేదికపై మెగా, నందమూరి ఇంకా అక్కినేని హీరోలను చూసే అవకాశం ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే అఖిల్ కోసం ఈ గ్లోబల్ హీరోలు వస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటిస్తోండగా,అలాగే మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా, ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. ఖచ్చితంగా ఈ సినిమాతో అఖిల్ కూడా పెద్ద గ్లోబల్ స్టార్ కావడం పక్కా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: