
అలా ఇప్పుడు తాజాగా సీనియర్ నటులలో ఒకరైన కోటా శ్రీనివాసరావు గారు గురించి పలు విషయాలు గడచిన కొద్ది రోజుల నుంచి వైరల్ గా మారుతున్నాయి.. దీనిపై కోటా శ్రీనివాసరావు గారు స్పందిస్తూ సోషల్ మీడియాలో నేను చనిపోయాను అంటూ ప్రచారం చేస్తున్నారంట.. అది చూసి ఉదయం నుంచి నాకు 50 కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే.. పదిమంది పోలీసులు ఆ వార్త చూసి ఇంటికి రావడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు అంటే ప్రముఖులు వస్తారని సెక్యూరిటీ ఇద్దామని వచ్చినట్లుగా తెలియజేశారట.
ఉదయం లేవగానే ఉగాది పండుగ ఉన్న సమయంలో ఈ వార్త తనని చాలా బాధపెట్టిందంటూ తెలియజేశారు డబ్బు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి కానీ ఇలా ఒక మనిషిని ప్రాణంతో ఉండగానే సంపాదించడం సరికాదు అంటూ ఇలాంటి విషయాల పైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ తెలియజేశారు. ప్రజలు కూడా ఇలాంటివి అసలు నమ్మవద్దని కూడా తెలియజేయడం జరిగింది నేను బ్రతికే ఉన్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు కోటా శ్రీనివాసరావు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. దీంతో ఎట్టకేలకు కోట శ్రీనివాసరావు షేర్ చేసిన ఈ వీడియోతో తనపై వచ్చిన రూమర్లకు క్లారిటీ పడిందని చెప్పవచ్చు.