టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో  జరుపుతున్న ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వీరిద్దరూ కలిసి చేసిన రచ్చ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు.కొంతకాలం క్రితం నరేష్, పవిత్ర ప్రేమ ఇంకా పెళ్ళి వ్యవహారం ఎంత సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని గురించి అందరికీ తెలిసిందే.ఇప్పుడు అదే రియల్ ఎపిసోడ్‎ను 'మళ్లీ పెళ్లి' అనే సినిమాతో నరేష్ జనాల మీదకు వదిలేందుకు రెడీ అయ్యాడు.ఇక నరేష్ నిర్మాతగా సీనియర్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు దర్శకత్వంలో మళ్ళీ పెళ్లి సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించి శుక్రవారం నాడు ఓ టీజర్ కూడా విడుదలైంది. ఊహించని విధంగా ఈ టీజర్ మిలియన్ల వ్యూస్‎తో నెట్టింట్లో చాలా స్పీడ్ గా దూసుకెళ్తోంది. నరేష్, పవిత్రల విషయంలో రియల్‎గా జరిగిన సంఘటనలు రీల్‎లో ప్రదర్శించారు డైరెక్టర్ ఎం ఎస్ రాజు. ముఖ్యంగా టీజర్ చివర్లో వర్చే కన్నుకొట్టే సీన్ అయితే నెటిజన్స్‎ను విపరీతంగా ఆకట్టుకుంది.


నరేష్ తన ప్రేమాయణాన్ని తెరకెక్కిస్తున్నాన్న ఖుషీలో తాజాగా ఓ టీజర్‎ను కూడా విడుదల చేశాడు. నెట్టింట్లోనూ ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ టీజర్‎పై కొంతమంది నెటిజన్స్ మాత్రం బాగా ట్రోల్ చేస్తూ దారుణమైన కామెంట్స్  చేస్తున్నారు. మీ కెరీర్‎లో ఇలాంటి సినిమాలు మరిన్నీ తీసుకురావాలని టీజర్ కింద దారుణంగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఈ మూవీని ఎంఎస్ రాజు కాకుండా రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసుంటే ఇంకా బాగుండేదని ఉచిత సలహాలు ఇస్తున్నారు.ఇక ఓ నెటిజన్ అయితే రెచ్చిపోయి మళ్ళీ పెళ్లా, మరి మళ్లి..శోభనం ఎప్పుడు రిలీజ్ అంటూ దారుణంగా  కామెంట్స్  చేశాడు.ఇలా చెప్పుకోలేని విధంగా కూడా చాలా నెగిటివ్ ట్రోలింగ్స్ వస్తున్నా , సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నా హీరో నరేష్ మాత్రం తగ్గేదేలేదు అని అంటున్నాడు. ఇక అందుకు తగ్గట్లుగానే తన మూవీని ఓ రేంజ్‎లో ప్రమోట్ చేస్తున్నాడు నరేష్. కామెంట్స్‎ను పక్కన పెడితే ఈ టీజర్‎ను జనాలు అయితే ఎగబడి మరి చూస్తున్నారు. అందుకే మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: