తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.. విజయవాడలో పోరంకి లో అనుమాలు గార్డెన్లో ఈ వేడుకలను నిర్వహించడం జరిగింది.. ఈ వేడుకలకు దాదాపుగా పదివేల మంది హాజరైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు గెస్ట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రావడం జరిగింది. విమానాశ్రయంలో నటుడు బాలకృష్ణ రజనీకాంత్ కు పూలమాలవేసి ఆత్మీయంగా కౌగిలించుకొని స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి చీఫ్ చంద్రబాబు హిందూపురం ఎమ్మెల్యే నటుడు రజనీకాంత్ ఇలా అందరూ కూడా హాజరయ్యారు.



ఇక ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరిస్తూ టిడిపి ప్రస్థానం తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ప్రభంజనం పైన పలువురు నేతలు కూడా ప్రసంగించడం జరిగింది. సభ ప్రాంగణాన్ని మూడు భాగాలుగా విభజించారు.ఎన్ విభాగంలో విశిష్ట అతిథులు టీ విభాగంలో అతిథులు ఆర్ విభాగంలో సామాన్యులు కూర్చునే విధంగా ఈ వేదికను అలరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వేదికకు రజనీకాంత్ రావడంతో అభిమానులు కాస్త సంబరపడిపోతున్నారు. రజినీకాంత్ కు జపాన్ లో కూడా వీర అభిమానులు ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన రజనీకాంత్ ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి ముఖ్య కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన ఉండే అభిమానంతోనే ఆహ్వానించగానే కాదనకొండ సినిమా షూటింగ్లను రద్దు చేసుకొని మరీ వచ్చారని సమాచారం.

బాలకృష్ణ ,చంద్రబాబు నాయుడు వంటి వారు చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శించడం జరిగింది. కానీ అభిమానులు టిడిపి నేతలు మాత్రం ఎన్టీఆర్ నిజమైన వారసత్వ కలిగిన నటుడు అంటూ తెలియజేస్తూ ఉన్నారు.ఈ విషయంపై ఎన్నోసార్లు కూడా అభిమానులు అటు బాలయ్యను చంద్రబాబు నాయుడుని కూడా అడగడం జరిగింది. రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ ను సీఎంగా చూడాలని ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది ప్రజలు.. అంతేకాకుండా ఎన్టీఆర్కు సంబంధించిన ఏలాంటి ఫంక్షన్స్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ను  దూరం పెడుతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: