టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాల గురించి చర్చ తక్కువే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఉపాసన తల్లి కాబోతుంది అని తెలిసినప్పటినుండి టాలీవుడ్ లో ఆమె గురించి వార్తలు వస్తున్నాయి. ఉపాసన డెలివరీ ఎప్పుడు.. శ్రీమంతం ఎప్పుడు.. పుట్టేది ఆడబిడ్డ మగ బిడ్డ.. ఇంట్లోకి వారసుడు రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఒక టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఉపాసనకి సంబంధించిన ఒక వార్త ఇంట్లో వైరల్ అవుతుంది. 

ఉపాసన సీమంతం తాజాగా క్యాన్సిల్ అయింది అని సమాచారం వినబడుతోంది. ఇకపోతే ఈనెల 17 నా ఉపాసన సీమాంతం ఉంది. అంతే కాదు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారట మెగా ఫ్యామిలీ. కానీ ఇంకో నాలుగు రోజుల్లో ఉపాసన సీమంతం ఉంది అనగా ఉపాసన సీమంతాన్ని మెగా ఫ్యామిలీ క్యాన్సిల్ చేసింది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఉపాసనకి ఏడవ నెల అయితే చాలామంది ఐదవ నెలలో గాని లేదా ఏడవ నెలలో గాని సీమంతం చేస్తారు అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని ఉపాసన సీమంతం సైతం చాలా గ్రాండ్గా చేయాలని భావించారు మెగా ఫ్యామిలీ.

కానీ ఎవరు ఊహించిన విధంగా ఉపాసన తల్లి అనారోగ్యం బాగోలేదట. అంతేకాదు తన తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఉపాసన సీమంతాన్ని మెగా ఫ్యామిలీ క్యాన్సల్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దాంతో పాటు మరోవైపు నిహారిక విడాకుల అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారడంతో ఈ పరిస్థితుల్లో ఉపాసనకు సీమంతం చేయడం కరెక్ట్ కాదని మెగా ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడైతే సీమంతం క్యాన్సిల్ అయింది కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ సీమంతం చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: