ఈ సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలు ఎన్ని విడుదలైనా కూడా ఫ్లాప్ గా నిలుస్తూ ఉండడంతో విరూపాక్ష సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలో కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది కలెక్షన్ల పరంగా కూడా భారీగానే దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటి లో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ నెట్ ఫ్లిక్స్ ఓటిటి సంస్థ ఈ ఓటిటి హక్కులను సొంతం చేసుకుంది.
మే 21వ తేదీన ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు సమాచారం ఇప్పటికే థియేటర్ల వద్ద చూసిన వాళ్లతో పాటు థియేటర్లో చూడని వాళ్లను ఈ సినిమా చూడాలని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ స్టార్ మా దక్కించుకున్నట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఏ సినిమా స్టార్ మా హక్కు అన్ని భాషలలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రంలో ప్రముఖ బుల్లితెర నటుడు కూడా కీలకమైన పాత్రలో నటించారు అలాగే శ్యామల బ్రహ్మాజీ సాయి చందు తదితరులు కూడా నటించడం జరిగింది.