టాలీవుడ్ లో యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై.. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. ఇక గత సంవత్సరం కార్తికేయ2,18 పేజీ స్ వంటి చిత్రంతో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గ్యారీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 29వ తేదీన తెలుగుతోపాటు అన్ని భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే నిఖిల్తో పాటు చిత్ర బృందం వరుసగా ప్రమోషన్స్ పాల్గొనడం జరుగుతోంది.


తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ అద్భుతమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేశారు. హీరో నిఖిల్.. న్యూఢిల్లీలో కర్తవ్ పద్దులో స్పై టీజర్ ఎందుకు విడుదల చేశారని యాంకర్ అడగక తెలుగు సినిమా అంటే ఎక్కువగా హైదరాబాదు సిటీలోనే ప్రమోషన్స్ ఉండగా మీరు అక్కడ ఎందుకు టీజర్ ని విడుదల చేశారని ప్రశ్నపై స్పందించడం జరిగింది.


తాము ముందుగా హైదరాబాదులోనే టీజర్ విడుదల చేయాలని భావించాము కానీ హైదరాబాదులో ఎక్కడ కూడా నేతాజీ విగ్రహం లేదని అందుకే ఢిల్లీకి వెళ్లినట్లు వివరించడం జరిగింది. అంతేకాకుండా ఐకానిక్ కర్తవ్య ప్రాంతంలో విడుదలైన మొదటి సినిమా టీజర్స్ స్పై కావడం గమనార్హం. కార్తికేయ-2 సినిమా వాళ్ళే తన స్పైచిత్రంపై నార్త్ ఇండియన్ ఆడియన్స్ కు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని విషయాన్ని తెలిపారు. ఈ సినిమానికే రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అయితే ఈ సినిమా కథను కూడా అందించడం జరిగింది. ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించిన రవివర్మ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. మరి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ కు పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: