చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతో కాలంగా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో మీటూ అంటో సోషల్ మీడియాలో బాధితులు పోస్ట్ లు పెడుతున్న కారణంగా కాస్టింగ్ కౌచ్ అనేది కాస్త తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు.

చాలా మంది హీరోయిన్స్ మరియు నటీమనులు తాము కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయాలను అయితే బయట పెట్టారు.. ఇంకా కొందరు బయట పెడుతూనే ఉన్నారు.

తాజాగా బాలీవుడ్ నటి అయిన 'శుభ్ మంగళ్ మే దంగల్' అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు ను దక్కించుకున్న సంగీతా ఒడ్వాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను కెరీర్ ఆరంభం లో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ చెడు అనుభవాన్ని గురించి ఆమె చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన సమయం లో నేను అందరితో ఎంతో చనువు గా ఉండేదాన్ని. ఆ సమయం లో తెలిసి తెలియక దూరం గా ఉండాల్సిన వారితో కూడా నేను చనువుగా ఉండేదాన్ని.

దాంతో ఒకసారి ప్రముఖ నిర్మాత గా పేరున్న వ్యక్తి ఒంటరిగా సినిమా గురించి చర్చించాలి అంటూ నన్ను రమ్మన్నాడు. పదే పదే ఒంటరిగా రమ్మనడం తో నాకు అనుమానం వచ్చింది.

నిర్మాత రమ్మన్న చోటు కు ఒంటరిగా కాకుండా స్నేహితురాలితో కలిసి నేను వెళ్లాను. ఒంటరిగా రమ్మంటే నేను స్నేహితురాలి తో వెళ్లడంతో ఆయనకు బాగా కోపం వచ్చింది. నాతో అస్సలు ఏమీ మాట్లాడుకుండానే అర్జంట్ పని ఉందంటూ ఆయన వెళ్లి పోయాడు.

అప్పుడే నాకు అతడి ఉద్దేశం ఏంటో పూర్తిగా అర్థం అయ్యింది. ఆ తర్వాత కూడా అతడు నన్ను ఒంటరిగా కలిసేందుకు ఎంత గానో ప్రయత్నించాడు కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు అంటూ సంగీతా ఒడ్వాని పేర్కొందటా.. ఆ నిర్మాత ఎవరు అనే విషయం లో మాత్రం ఆమె క్లారిటీ అయితే ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: