పోస్ట్ ఆఫీస్  ప్రజల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. ఖచ్చితమైన రాబడి వస్తుంది.. అయితే పోస్ట్ ఆఫీస్ ఎప్పుడూ  ప్రవేశపెట్టే స్కీమ్ లతోపాటు ఇప్పుడు సరికొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ స్కీమ్.. ఈ స్కీం లో  ఎలాంటి నష్టాలు ఉండవు. చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్.. అయితే దీని వివరాలేమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం కింద రూ.100  నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. నిర్ణీత కాలం వరకు ఇన్వెస్ట్ చేస్తూ పోతే , ఈ స్కీమ్ ముగిసేసరికి మిలియనీర్ కూడా అవ్వచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. డబ్బుకు తగిన  రాబడి కూడా కచ్చితంగా వస్తుంది. ఇక దీని మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు. ఒకవేళ అవసరం అనుకుంటే మీరు ఏడాది తర్వాత కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు.. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి స్కీమ్ ల పై వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకొకసారి సవరించినట్టు గానే, ఈ స్కీమ్ పై వడ్డీ రేటును కూడా ప్రతి మూడు నెలలకొకసారి సవరిస్తుంది. అంటే ఒక వేళ వడ్డీరేట్లను పొడిగించవచ్చు లేదంటే అలాగే స్థిరంగా కూడా కొనసాగించవచ్చు..


ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.8 శాతం వడ్డీ వస్తుంది.. ఇక అంతే కాకుండా మీరు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.ప్రతి ఆరు నెలలకు ఒకసారి డబ్బులు మీ అకౌంట్ కు చేర్చబడతాయి.. ఇక ఒకవేళ మీరు ఈ స్కీమ్ ద్వారా ఏడు లక్షల రూపాయలను పొందాలని అనుకుంటే, అందుకు తగ్గట్టుగా మీరు ఈ స్కీమ్ లో  ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.. చూశారు కదా ! మరి ఇంకెందుకు ఆలస్యం. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ స్కీమ్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకొని, అతి తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడిని పొందండి..


మరింత సమాచారం తెలుసుకోండి: