ఈ పథకాలలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకం కూడా ఒకటి. ఇక ఈ స్కీమ్ పూర్తి వివరాల్లోకి వస్థే.. ఈ పథకంలో చేరడం వలన మీరు కూడా రూ.15 లక్షలు పొందొచ్చు. ప్రస్తుతం పోస్టు ఆఫీస్ ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు కూడా లభిస్తోంది.. రూ.1000తో మీరు ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకంలో ఖాతా తెరవచ్చు.గరిష్టంగా మీరు ఈ పథకంలో రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. 60 యేళ్లు దాటిన వాళ్ళు కూడా ఇందులో డబ్బులు పెట్టవచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. అయితే ముందుగానే డబ్బులు విత్డ్రా చేసుకుంటే మాత్రం చార్జెస్ పడతాయి.
ఇది ఇలా వుండగా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ పథకంలో పెట్టిన డబ్బులపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. మీరు కనుక ఈ స్కీమ్ నుండి రూ.15 లక్షలు పొందాలని అనుకుంటే.. అప్పుడు ఈ పథకంలో రూ.10.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి దాదాపు రూ.15 లక్షలు వస్తాయి అంతేకాకుండా మీకు కావాలంటే మరో మూడు యేళ్ళు గడువును పెంపొందించుకోవచ్చు.