దేశంలో ఉన్న ఎంతోమంది పేద ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోపాటు పోస్ట్ ఆఫీస్ కూడా సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా మనకు ఎన్నో రకాల సేవలను అందించడానికి సిద్ధమైంది. ఇలా ఈ పథకాల ద్వారా చాలా మంది డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ సరికొత్త పోస్ట్ ఆఫీస్ స్కీం లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల 15 లక్షల రూపాయలను మీరు పొందవచ్చు. ఈ సరికొత్త పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. అంతే కాకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వలన మన డబ్బును డబుల్ చేసుకోవచ్చు.


ఈ పథకాలలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకం  కూడా ఒకటి. ఇక ఈ స్కీమ్ పూర్తి వివరాల్లోకి వస్థే.. ఈ పథకంలో చేరడం వలన  మీరు కూడా రూ.15 లక్షలు పొందొచ్చు. ప్రస్తుతం పోస్టు ఆఫీస్ ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు కూడా లభిస్తోంది.. రూ.1000తో మీరు ఈ  సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకంలో ఖాతా తెరవచ్చు.గరిష్టంగా మీరు ఈ పథకంలో రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది. 60 యేళ్లు  దాటిన వాళ్ళు కూడా ఇందులో డబ్బులు పెట్టవచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. అయితే ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే  మాత్రం చార్జెస్ పడతాయి.

ఇది ఇలా వుండగా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఈ పథకంలో పెట్టిన డబ్బులపై పన్ను మినహాయింపు కూడా  ఉంటుంది. మీరు కనుక ఈ స్కీమ్ నుండి రూ.15 లక్షలు పొందాలని అనుకుంటే.. అప్పుడు ఈ పథకంలో రూ.10.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి దాదాపు రూ.15 లక్షలు వస్తాయి అంతేకాకుండా మీకు  కావాలంటే మరో  మూడు యేళ్ళు గడువును పెంపొందించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: