ఉద్యోగుల భవిష్యత్తు ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎన్నో రకాల కొత్త పథకాలను అందిస్తోంది. ఇప్పటికే వచ్చిన కొన్ని సేవింగ్ ప్లాన్ లను కూడా అందరికీ అందుబాటులో తీసుకు రావడం గమనార్హం . ఇక అలాంటి వాటిలో ఈపీఎఫ్ పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద ఖాతాదారుడు సుమారుగా ఏడు లక్షల రూపాయల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ స్కీమ్ కింద ఈ పీ ఎఫ్ ఖాతాదారుడు ఈ బీమా రక్షణను  ప్రభుత్వం కింద పొందవచ్చు. ఈ పథకం ద్వారా ఖాతాదారుడు ఉద్యోగం లో ఉన్నప్పుడు మరణిస్తే అతడి ఖాతా లో జమ అయిన డబ్బు నామినికి లేదా ఖాతాదారుడు నామినీకి ఇవ్వడం జరుగుతుంది.

దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో ఖాతాదారుడు మరణిస్తే కుటుంబ సభ్యులు ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ స్కీమ్ కింద డెత్ క్లైమ్ చేసుకోవచ్చు. ఇక ఈ పథకం కింద ఖాతాదారుడు గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు పొందడానికి ఈ - నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఇక ఈ - నామినేషన్ చేయకుండా డబ్బు అనేది విత్ డ్రా చేసుకోలేరు . ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో డబ్బు తీసుకోవడానికి నామినీ ధృవ పత్రం కూడా చాలా అవసరం అవుతుంది. ఇక ఈ - నామినేషన్ ప్రక్రియ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

ముందుగా..epfindia.gov.in అనే వెబ్సైట్ పై క్లిక్ చేయాలి. ఇక మీరు సేవ ఎంపికను ఎంచుకున్న తర్వాత ఈపీఎఫ్ఓ యొక్క యు ఏ ఎన్ నెంబర్ ,పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి. ఇక మేనేజ్ ఎంపిక పై క్లిక్ చేసి వివరాలు అందించి.. ఎంపికపై మరొకసారి క్లిక్ చేయాలి. ఇక ఫ్యామిలీ డిక్లరేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి తర్వాత అన్ని వివరాలను అందించాలి. తర్వాత సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ నింపితే ఈ - నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక తర్వాత ఈ డి ఎం ఐ పథకాల యొక్క ప్రయోజనాలను ఖాతాదారుడు సులభంగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: