2020 సంక్రాంతి బరిలో పందెంకోళ్లుగా పోటీకి దిగుతున్నారు సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మహేష్ సరిలేరు నీకీవ్వరు సినిమాతో వస్తుండగా.. బన్ని అల వైకుంఠపురములో అంటూ ప్రేక్షకులను పలుకరించనున్నాడు. క్రేజీగా మారిన ఈ ఇద్దరి హీరోల బాక్సాఫీస్ ఫైట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రెండు సినిమాలు జనవరి 12నే రిలీజ్ అంటున్నారు.

 

అయితే ఒకేరోజు కాకుండా ఒకరోజు గ్యాప్ తో ఈ సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే కాకుండా రెండు సినిమాలు పోటీ పడుతున్నా ఇద్దరు హీరోలు కలిసి రెండు సినిమాలను ప్రమోట్ చేసేలా అదిరిపోయే ప్లాన్ చేశారట. ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా సంక్రాంతికి వచ్చే సినిమా హీరోలు ఇద్దరితో కలిసి ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట. ఇంటర్వ్యూ చేసేది కూడా త్రివిక్రం శ్రీనివాస్ అని తెలుస్తుంది.

 

అల వైకుంఠపురములో డైరక్టర్ త్రివిక్రమే కాబట్టి అల్లు అర్జున్ ఈ ఇంటర్వ్యూకి ఓకే అన్నాడట. మహేష్ త్రివిక్రం మంచి స్నేహ్తిఉలు అందుకే ఈ ప్రపోజల్ కు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమాల పరంగా పోటీ ఉన్నా సంక్రాంతికి స్పెషల్ ఇంటర్వ్యూగా ఇద్దరి హీరోలను ఒకచోట చేర్చే ప్లాన్ చేస్తున్నారట. ఇది నిజంగా ఓ అద్భుతమైన ఆలోచన అని చెప్పొచ్చు.

 

అయితే ఇది వర్క్ అవుట్ అయితే మాత్రం ఈ పద్ధతి మిగతా పండుగల సమయాల్లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. తాము చేయాల్సిన ప్రమోషన్స్ ఎంత చేసినా సినిమాలో మ్యాటర్ ఉంటేనే స్టార్ సినిమా అయినా ఆడేది. సో త్రివిక్రంతో మహేష్, అల్లు అర్జున్ ఇంటర్వ్యూ తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతుందని చెప్పొచ్చు. అయితే ఈ ఇంటర్వ్యూ గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం త్వరలో తెలుస్తుందట. మహేష్, బన్ని అరుదైన ఈ కాంబో స్పెషల్ చిట్ చాట్ క్రేజీగా మారనుందని చెప్పడంలో సందేహం లేదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: