నాగచైతన్య స్టార్ డమ్ పై సీరియస్ ఫోకస్ పెట్టాడు. ఈ అక్కినేని యంగ్ హీరో పర్ ఫెక్ట్ ప్లానింగ్ స్టార్ లీగ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా చైతూ బ్లాక్ బస్టర్స్ డైరెక్టర్స్ ను టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటికే బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేస్తున్న నాగచైతన్య ఇప్పుడు ఇండస్ట్రీ ఇచ్చిన దర్శకుడిని పట్టేశాడు. 

 

కెరీర్ ఆరంభంలో తడబడిన నాగచైతన్య ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాడు. ఇన్నాళ్లూ యావరేజ్, హిట్ సినిమాలతో కెరీర్ నెట్టుకొస్తున్న చైతూ ఇప్పుడు బ్లాక్ బస్టర్ ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. లాస్ట్ ఇయర్ మజిలీ బ్లాక్ బస్టర్ తో కెరీర్ పరంగా బెస్ట్ హిట్ అందుకున్న అక్కినేని హీరో ఇప్పుడు స్టార్ స్టేటస్ పై కన్నేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే చైతూ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకులతో వరుసగా సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. 

 

ప్రస్తుతం నాగచైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సిిినిమాలో నటిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది. టీజర్ లో ఫ్రెష్ లుక్ తో అట్రాక్ట్ చేస్తున్న చైతూ కెరీర్ పరంగా మరో సక్సెస్ కొట్టబోతున్నట్టే కనిపిస్తోంది. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. సాయిపల్లవి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

 

అదేవిధంగా గీత గోవిందంతో సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన పరశురాం దర్శకత్వంలో నాగచైతన్య కొత్త సినిమా చేయబోతున్నాడు. చైతూకి ఇది 20వ సినిమా కావడంతో కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలబెట్టాలని పరశురాంకు చెప్పాడట. శేఖర్ కమ్ముల, పరుశురాంతో చేస్తున్న సినిమాలో స్టార్ స్టేటస్ అందుకోవాలని నాగచైతన్య టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇండస్ట్రీలో క్లాస్ హీరో ప్లేస్ ని రీప్లేస్ చేయడంతో పాటు క్లాస్ స్టార్ గా లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా నిలబడేందుకు నాగచైతన్య ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: