యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా చేసిన కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ లాస్టి ఇయర్ చివర్లో వెంకీమామ అంటూ వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్న బాబీ ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేయాలని ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే చిరుని కలిసి బాబి కథ వినిపించాడట. చిరుకి కథ నచ్చిందట. అయితే మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ బాధ్యతలను బాబీ మీద పెట్టాలని అనుకున్నారట. అయితే బాబీ చెప్పిన కథ నచ్చడంతో అతని కథతోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట చిరంజీవి. 

 

ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా లూసిఫర్ రీమేక్ దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. సాహో ఫేమ్ సుజిత్ ఈ సినిమాను రీమేక్ చేస్తాడని అంటున్నారు. ఆ తర్వాత చిరు బాబీతో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో కొన్నాళ్ళు వెనుకపడ్డ బాబీ మళ్ళీ తారక్ జై లవ కుశ సినిమాతో తన సత్తా చాటాడు. వెంకీమామతో కూడా మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న బాబీ ఈసారి మరో పవర్ ఫుల్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మెగాస్టార్ మీద గురి పెట్టాడు బాబీ. 

 

మెగా హీరోల అభిమానంతోనే పరిశ్రమకు వచ్చిన బాబీ మెగాస్టార్ తో సినిమా ఛాన్స్ వస్తే అంతకుమించిన అదృష్టం ఇంకోటి ఉండదు. రైటర్ గా తన సత్తా చాటి దర్శకుడిగా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్న బాబీ చిరుతో చేసే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఏ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తాడా లేక బయట నిర్మాతలకు అవకాశం ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: