హీరోయిన్స్ అందరిదీ ఒక దారైతే.. ఆ ముగ్గురిది మరో దారి. షూటింగ్స్ లేవు..రెస్ట్ తీసుకోండి అంటే.. ఆ ముగ్గురు మాత్రం ఇప్పటికి ఇంకా షూటింగ్ లో ఉన్నట్టే  ఫీలవుతూ.. గ్లామర్ ఒలకబోస్తున్నారు. 

 

కరోనా హాలిడేస్ లో నటీనటులంతా సోషల్ మీడియాలో బిజీ అయిపోయారు. చిరంజీవి అయితే ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చి కరోనా విషయంలో సలహాలు.. సూచనలు చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. హీరోయిన్స్ కూడా.. ప్రధానికి అండగా నిలుస్తూ.. చప్పట్లు కొట్టారు. కొవ్వొత్తులు వెలిగించారు. ఇలా చాలామంది కరోనాను నియంత్రించే పనిలో ఉంటే.. సన్నీ.. నభా నటేష్.. నిధి అగర్వాల్ మాత్రం ఇన్ స్టాగ్రామ్ ను హీటెక్కిస్తున్నారు. 

 

కరోనా అయితే నాకేంటి.. గిరోనా అయితే నాకేంటి.. నా పని గ్లామర్ గుప్పించడమే అనే కాన్సెప్ట్ తో ఉంది సన్నీలియోన్. అందాల ఆరబోతకు అలవాటు పడిపోయిన ఈ కెనడియన్ బ్యూటీ.. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. గ్లామర్ ఫోజులతో ఇన్ స్టాగ్రామ్ ను రెచ్చగొడుతోంది. 

 

ఫారిన్ బ్యూటీ సన్నీలియోన్ తో ఇస్మార్ట్  భామలు నిధి అగర్వాల్.. నభానటేష్ పోటీపడుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా.. ఈ ఇద్దరు ఒకటీ అర చిన్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు. పెద్ద హీరోల పక్కన ఛాన్స్ దక్కలేదు. కరోనా కష్టాల్లో తమను ఎక్కడ మరిచిపోతారన్న ఫీలింగ్ కాబోలు.. గ్లామర్ స్టిల్స్ ఒక్కొక్కటీ ఒదులుతూ.. గుర్తుంచుకొమ్మంటున్నారు. 

 

నభానటేష్ కంటే.. నిధి అగర్వాల్ ఎక్కువ వేడి పుట్టిస్తోంది. నభా ప్రస్తుతం రెండు సినిమాలు సోలో బతుకే బెటర్.. అల్లుడు అదుర్స్ లో సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ తో జతకడుతుంటే.. నిధి మాత్రం గల్లా అశోక్ సినిమా మాత్రమే చేస్తోంది. కరోనా సెలవుల్లో సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటే.. అంతగా చూస్తారు. ఇదే ప్లాన్ తో.. ఫోజులు కొడుతూ.. సోషల్ మీడియాకు వేడిపుట్టిస్తూ.. తమదైన ముద్ర వేస్తున్నారు ఇస్మార్ట్ భామలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: