ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పై నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న తారక నేషనల్ వైడ్ గా సత్తా చాట్ టైం వచ్చిందని తెలుస్తుంది. ఇప్పటికే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేసే త్రివిక్రమ్ సినిమాను కూడా నేషనల్ వైడ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇదే కాకుండా కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్ట్ మూవీ కూడా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ క్రేజీ డైరక్టర్ చెప్పాలంటే రాజమౌళి తర్వాత పిరియాడికల్ మూవీస్ తీయాలంటే సత్తా ఉన్న డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. 

 

ఆయన డైరక్షన్ లో తారక్ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఇది కూడా పిరియాడికల్ మూవీగా వస్తుందట. ఈ మూవీలో విలన్ గా రణ్ వీర్ సింగ్ నటిస్తాడని అంటున్నారు. అదే జరిగితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ రికార్డుల మోత మోగినట్టే అవుతుంది. సంజయ్ లీలా భన్సాలీ డైరక్షన్ లో తారక్ సినిమా అనగానే ఫ్యాన్స్ లోనే కాదు సినీ ప్రియుల్లో కూడా ఒక ఎక్సయిట్మెంట్ మొదలైంది. ఎన్టీఆర్ టాలెంట్ ఏంటో ఇన్నాళ్లు ఒకరు చెబుతుంటే విన్న బీ టౌన్ ఆడియెన్స్ ఆర్.ఆర్.ఆర్ లో అతని నట విశ్వరూపం చూసి ఫిదా అవకా తప్పదు. రాజమౌళి ఎక్కుపెడుతున్న ఈ భీమ్, అల్లూరి పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ దుమ్ముదులిపేస్తారని చెప్పొచ్చు. 

 

ఆ సినిమాతో బాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఫ్యాన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఆ నెక్స్ట్ అక్కడ స్టార్ డైరక్టర్ తో సినిమా చేస్తే ఇక బాలీవుడ్ లో కూడా కెరియర్ సెట్ అయినట్టే.. త్రివిక్రమ్ తో చేసే సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తే ఇక ప్రభాస్ తో పాటుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా పాన్ ఇండియా స్టార్స్ గా ప్రమోట్ అయినట్టు అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: