డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ థింకింగ్ థాట్స్ చకా చకా మారిపోతున్నాయి. కరోనాకు ముందు ఒక విధంగా ఆలోచించన వాళ్లు.. ఇప్పుడు ఇంకో విధంగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కొత్తగా యాక్ట్ చేస్తున్న సినిమా పుష్పలో ఐటం సాంగ్ పై కరోనా ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ముందు ఓ హిందీ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ చేయించాలని ప్రణాళిక రూపొందించారు. బడ్జెట్ కంట్రోల్ అయిన కారణంగా బాలీవుడ్ బ్యూటీ బదులు వేరొకరిని తీసుకుంటారేమో... 

 

దర్శకుడు సుకుమార్ మూవీలో ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో నాన్నకు ప్రేమతో కథ మాత్రమే స్పెషల్ సాంగ్ ను ఎక్స్ పెక్ట్ చేయలేదు. లెక్కల మాస్టార్ ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం.. అదిరిపోయే ట్యూన్ ఇస్తాడు దేవీశ్రీ. 

 

పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం దేవీశ్రీ మాస్ బీట్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్ ఒకేసారి పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు.  సినిమా లుక్.. లోగో రిలీజ్ చేసేటప్పుడే దక్షిణాది బాషలన్నింటితో పాటు.. హిందీ లోగోను కూడా రిలీజ్ చేశారు. హిందీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని.. బాలీవుడ్ భామ దిశాపటానీతో ఐటం సాంగ్ చేయించాలనుకున్నాడు దర్శకుడు.

 

పాన్ ఇండియా నేపథ్యంలో దిశా పటానీతో ఐటం సాంగ్ చేయించాలనుకున్నా.. కరోనా దెబ్బకు పరిస్థితులు మారిపోయాయి. బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శృతిహాసన్ లాంటి లోకల్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ కోసం 50లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్ ఉన్న దిశాతో ప్రత్యేక గీతమంటే ఇంతకంటే ఎక్కువే ముట్టజెప్పాలి. అయితే అయింది కానీ బాలీవుడ్ మార్కెట్ కోసం ఖర్చుపెడతారా.. లేదంటే.. లోకల్ గ్లామర్ తో ఐటమ్ సాంగ్ పూర్తి చేస్తారో చూడాలి. కొత్త ప్రయోగం ఏమాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: