హీరోయిన్స్ లో ఒక్కొక్కరు ఒక్కోలా తమ కెరియర్ ప్లాన్ చేసుకుంటారు. కొందరు స్కిన్ షోకి ఎలాంటి అడ్డు చెప్పరు కానీ కొందరు మాత్రం గ్లామర్ షో అంటే ఆమడదూరం వెళ్తారు. కేవలం అభినయంతోనే వారు ప్రేక్షకులను మెప్పిస్తారు. అలాంటి వారిలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో చెప్పుకుంటే కీర్తి సురేష్ ఒకరు. కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తూ వస్తుంది ఈ అమ్మడు. 

 

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మహానటితో నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అయితే అందరికన్నా కొద్దిగా బొద్దుగా కనిపించే కీర్తి సురేష్ ఈమధ్య పూర్తిగా ఎండి పోయినట్టుగా కనిపిస్తుంది. దానికి కారణం అమ్మడు కూడా బికిని వేసేందుకు రెడీ అయ్యిందట. తెలుగులో ప్రస్తుతం నితిన్ రంగ్ దే, మిస్ ఇండియా సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ ఒక స్టార్ హీరో సినిమాకు సైన్ చేసిందట. అందులో బికిని సీన్స్ ఉండగా కీర్తి సురేష్ దానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. 

 

కీర్తి సురేష్ కూడా బికిని వేయడం మొదలు పెడితే ఇక ఆ రచ్చ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. అందుకు అమ్మడు భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తుందని తెలుస్తుంది. నితిన్ రంగ్ దే తర్వాత చైతన్య కృష్ణ డైరెక్షన్ లో చేసే పవర్ పేట్ సినిమాలో కూడా ఆమె ఛాన్స్ అందుకుంది. మరి కీర్తి బికిని న్యూస్ లో ఎంతవరకు వాస్తవం అన్నది త్వరలో తెలుస్తుంది. అదే జరిగితే ఇక మిగతా హీరోయిన్స్ కు చాలా టఫ్ ఫైట్ అన్నట్టే లెక్క. మరి కీర్తి స్పెషల్ అప్డేట్ వచ్చేదాకా ఇది రూమర్ మాత్రమేనా రియలా అన్నది చూడాలి. కీర్తి గ్లామర్ షో చేయడం మొదలు పెడితే ఆమె ఫ్యాన్స్ కు పండుగే.. దర్శక నిర్మాతలు కూడా ఆమెకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: