సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పి.వాసు డైరక్షన్ లో వచ్చిన సినిమా చంద్రముఖి. 2005లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూదా భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వల్ గా తెలుగులో నావల్లి సినిమా చేశాడు విక్టరీ వెంకటేష్. అయితే సినిమా ఆషించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. 

 

లేటెస్ట్ గా తమిళంలో ఈ సినిమా సీక్వల్ ప్లాన్ చేశారు. లారెన్స్ ప్రధాన పాత్రలో నటించే ఈ సినిమాను ఫై.వాసు డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో నిన్నటితరం స్టార్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తుందని తెలుస్తుంది. రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో కూడా సిమ్రాన్ ను హీరోయిన్ గా అనుకున్నారట. ఆమె ఎందుకో ఆ ప్రాజెక్ట్ చేయలేదు. అందుకే ఆ ఛాన్స్ జ్యోతికకు వచ్చింది. 

 

వచ్చిన అవకాశాన్ని తన అభినయంతో మెప్పించింది జ్యోతిక. ఇక ఇప్పడు సీక్వల్ లో సిమ్రాన్ నటిస్తుందని తెలుస్తుంది. ఈమధ్య హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన లారెన్స్ త్వరలో చంద్రముఖి సీక్వల్ తో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కథ కథనాలు కూడా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో ఉండేలా థ్రిల్ చేస్తాయని అంటున్నారు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు చేయడంలో అందవేసిన చెయ్యిగా మారిన లారెన్స్ చంద్రముఖి 2తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడా చూడాలి. అప్పుడు మిస్సైన చంద్రముఖి ఛాన్స్ సీక్వల్ లో అందుకున్న సిమ్రాన్ కచ్చితంగా తన సత్తా చాటుతుందని చెప్పొచ్చు. ఒకప్పటి తారలంతా క్యారెక్టర్స్ రోల్స్ తో సర్ ప్రయిజ్ చేస్తుండగా చంద్రముఖి 2 తో సిమ్రాన్ కొత్త సంచలనానికి సిద్ధమైంది.                         

మరింత సమాచారం తెలుసుకోండి: