కరోనా కేసులు రోజురోజుకూ పెరగడం మన స్టార్స్ ను భయపెడుతోంది. నిన్నటి వరకు ఎప్పుడెప్పుడు షూటింగ్స్ కు పర్మీషన్ ఇస్తారా.. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్లిపోదామా..అని కాచుకు కూర్చున్న హీరోలు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. షూటింగ్ అంటే వెయిట్ చేద్దామంటున్నారు.

 

షూటింగ్స్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. స్టార్స్ మాత్రం ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేది లేదంటున్నారు. నెలాఖరు వరకు లాక్ డౌన్ ఉన్నా.. అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సడలింపులు ఇచ్చేశాయి. జన జీవనం సాధారణ స్థాయికి వచ్చేసింది. మరోవైపు కరోనా కేసులు పెరిగిపోయాయి. కేసులతో పాటు.. మరణాలు కూడా పెరగడంతో సినిమా ఇండస్ట్రీ ఆందోళనలో పడింది. 

 

కరోనా భయం మన హీరోలను వెంటాడుతోంది. ఎంతగా.. ముందు జాగ్రత్తలు తీసుకున్నా.. చిత్రయూనిట్ సంఖ్యను కుదించినా.. కరోనా ప్రభఆవం తగ్గిన తర్వాతే షూటింగ్ చేసుకుందామన్నా సంకేతాలు హీరోలు పంపిస్తున్నారట. హీరో లేకుండా షూటింగ్‌స్ స్టార్ట్ చేయాలని నిర్మాతలు అనుకోవడం లేదు. ఈ లెక్కన పెద్ద సినిమాలు ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ లెక్కన బన్నీ నటిస్తున్న పుష్ప.. ప్రభాస్ జాన్.. మహేశ్ సర్కార్ వారి పాట సినిమాల షూటింగ్స్ ఈనెల స్టార్ట్ మొదలు కావడం కష్టమే. 

 

కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వ్యాక్సిన్ వచ్చే దాకా వెయిట్ చేద్దామన్న ఉద్దేశంలో కొందరు స్టార్స్ ఉన్నారట. వచ్చిన తర్వాతే కెమెరా ముందుకు రావాలని స్టార్స్ డిసైడ్ అయితే.. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటారో తెలియని గందరగోళ పరిస్థితిలోకి సినిమా ఇండస్ట్రీ వెళ్లిపోతుంది. ఆ మధ్య కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న మహేశ్ కొత్త సినిమా సర్కారు వారి పాటను ఎనౌన్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్ లో మొదలు పెడతారన్న వార్తలొస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: