మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు రావడం అప్పట్లో ఓ హాట్ టాపిక్. అసలు తానెందుకు బయటకు వచ్చానో చెబుతూ రెండు మూడు వీడియోలు కూడా పెట్టాడు నాగబాబు. అయితే నాగబాబు వర్షన్ ఒకలా ఉంటే అక్కడ ఇప్పటికి పనిచేస్తున్న వారి వర్షన్ మరోలా ఉంది. తమ టాలెంట్ చూపేందుకు మల్లెమాల మాకో అద్భుతమైన ఫ్లాట్ ఫాం ఏర్పరచింది అని కొందరు అంటున్నారు. ఇక జబర్దస్త్ నుండి నాగబాబు ఎగ్జిట్ అంశంపై ఆ ప్రోగ్రాం యాంకర్ అనసూయ స్పందించింది.
ఇక్కడ ఎవరిని ఎవరు బలవంతంగా ఉంచరు. ఇష్టం ఉన్న వాళ్లు ఉంటారు.. లేని వాళ్లు వెళ్లిపోతారు. ఎవరు ఇక్కడ పర్మినెంట్ కాదని చెప్పింది. ఆయన స్వంత అభిప్రాయం మేరకే నాగబాబు గారు వెళ్లారని.. అలా వెళ్లినంత మాత్రాన ఆయన పగతోనే చేయడం కరెక్ట్ కాదని అంటుంది అనసూయ. ఇక్కడ ఎవరిని బలవంతంగా ఉంచరు.. అలా అని బలవంతంగా వెళ్లగొట్టరు. వారి ఇష్టానుసారంగానే వెళ్లే అధికారం ఉందని అంటుంది అనసూయ.
మొత్తానికి నాగబాబు ఎగ్జిట్ పై తన మార్క్ కామెంట్స్ తో అటు ఆయన్ను తప్పుపట్టకుండా ఇటు మల్లెమాట మీద ఎలాంటి కామెంట్స్ చేయకుండా మాట్లాడింది అనసూయ. జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిన నాగబాబు జీ తెలుగులో అదిరింది షో చేస్తున్నారు. మొదట్లో రొటీన్ అనిపించిన ఆ షో ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. అయితే లాక్ డౌన్ టైం లో షో నడవకపోవడంతో మళ్లీ బ్రేక్ వచ్చింది. ఈమధ్యనే షూటింగ్స్ కు ఓకే చెప్పడంతో జబర్దస్త్ స్టార్ట్ చేసినట్టుగా అనసూయ తన సోషల్ బ్లాగ్ ద్వారా ఇన్ఫాం చేసింది. త్వరలో అదిరింది కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.