బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఓలివియ మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం మళ్లీ షూటింగ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని కూడా నటిస్తున్నాడని తెలిసిందే.

 

సినిమాలో సముద్రఖని కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఆయన నటించినందుకు గాను 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో కూడా సముద్రఖని నటించారు. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్ లో కూడా ఆయన భాగస్వామ్యం అవుతున్నారు. 

 

అంతేకాదు ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారని తెలిసిందే. అజయ్ దేవగన్ కూడా ట్రిపుల్ ఆర్ లో భాగమవుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరో బాహుబలి కాదు అంతకుమించి రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు రాజమౌళి.

 

ఇప్పటికే అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రాం చరణ్ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచిన రాజమౌళి త్వరలోనే కొమరం భీం ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. 2021 జనవరి 8న రిలీజ్ డేట్ ప్రకటించినా కూడా సినిమా తప్పకుండా వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్. కరోనా వల్ల లాక్ డౌన్ వల్ల స్టార్స్ షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు. ఈమధ్యనే ట్రైల్ షూట్ చేస్తారని తెలిసినా దానికి భారీ సెట్ వేయాలని రాజమౌళి వెనుకడుగు వేశాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.                     

మరింత సమాచారం తెలుసుకోండి: