ఏదో ఒకటి చేయాలి కదా అని ఏది పడితే అది చెయ్యను. లేట్ అయినా పరవాలేదు. రెండేళ్లు గానీ.. మూడేళ్లు గానీ భారీ సినిమాతోనే వస్తా అంటున్నాడు షారుఖ్ ఖాన్. అయితే రెండేళ్ల నుంచి ఇదే మాట చెబుతున్నాడు షారుఖ్. బాహుబలి రేంజ్ అయితేనే చేస్తా లేకపోతే లేదు అని రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో బాద్ షా ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అవుతున్నారు. 

 

లాక్ డౌన్ పీరియడ్ లో హీరోలంతా.. కొత్తకొత్త కథల గురించి ఆలోచిస్తుంటే.. షారుఖ్ ఖాన్ మాత్రం ఇంకా జీరో ఎఫెక్ట్ నుంచి బయటపడటం లేదు. మరో సినిమా గురించి ఆలోచించకుండా.. రెండేళ్లుగా ఈ డిజాస్టర్ తోనే ట్రావెల్ చేస్తున్నాడు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు డిజాస్టర్స్ నుంచి కోలుకొని సినిమాలు చేస్తోంటే బాద్ షా మాత్రం ఫ్లాపునే తలచుకొని క్వారంటైన్ లో ఉండిపోతున్నాడు. 

 

షారుఖ్ ఖాన్ కామ్ అయిపోవడంతో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. తమ హీరో ఇంకా సినిమాలు చేయడా అని బాధపడిపోతున్నారు. మీడియా ఇంటరాక్షన్స్ లో ఇదే విషయం అడిగితే.. షారుఖ్ ఖాన్ కొంచెం వింత సమాధానం చెప్పాడు. వెంటనే సినిమా చేయాలి కదా అనీ.. ఏదో ఒక కథలో నటించను.. భారీ స్టోరీతోనే బరిలో దిగుతానని చెప్పాడు షారుఖ్. 

 

షారుఖ్ ఖాన్ పేరు ఉంటే చాలు సినిమా బడ్జెట్ 100కోట్లు దాటిపోతుంది. మరి భారీ మూవీ అంటే షారుఖ్ కి 200కోట్ల బడ్జెట్ కావాలా.. బాహుబలి రేంజ్ లో పీరియాడికల్ డ్రామా కావాలా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే 2018 నుంచి భారీ కథ కోసం చూస్తున్న షారుఖ్ కు రాజ్ కుమార్ హిరాణి బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడని.. ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు బాద్షా ప్రయత్నిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: