యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను నా ప్రాణమని చెప్పిన మంచు హీరో మనోజ్ ఇప్పుడు అతనితో పగ పెంచుకోడానికి సిద్ధమయ్యాడు. తారక్ తో మనోజ్ ఢీ అంటే ఢీ కొట్టబోతునారు. ఇద్దరిది పొలిటికల్ రివెంజ్ అట. అసలు ఈ ఇద్దరికి పొలిటికల్ గా ఎప్పుడు ఎక్కడ తేడా వచ్చింది అంటే ఇదంతా తారక్ చేయబోయే నెక్స్ట్ సినిమా కోసమని తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్.టి.ఆర్. సినిమాలో కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు ఈ హీరో.

 

మూవీ తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో తారక్ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ అనుకుంటున్నారట. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని టాక్. ఇక సినిమాలో విలన్ గా మంచు మనోజ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈమధ్య హీరోగా కెరియర్ లో పూర్తిగా వెనుకపడ్డ మనోజ్ లేటెస్ట్ గా తన సొంత ప్రొడక్షన్ లో అహం బ్రహ్మస్మి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడట.

 

ఇక ఇదే కాకుండా డిఫరెంట్ గా అనిపిస్తే నెగటివ్ రోల్స్ కు రెడీ అంటూ చెప్పుకొచ్చాడు. త్రివిక్రం, తారక్ సినిమాలో విలన్ రోల్ లో మనోజ్ తో చేయించాలని చూస్తున్నారు. ఒకవేళ మనోజ్ చేస్తాడని అంటే మాత్రం తప్పకుండా ఈ క్రేజీ కాంబో మరో సంచలనంగా మారుతుందని తెలుస్తుంది. అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రం తారక్ సినిమాను నేషనల్ వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.                                

మరింత సమాచారం తెలుసుకోండి: