ఫస్ట్ హాఫ్ కొంత వరకూ పర్వాలేదు అనిపించినా.. సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందనే కామెంట్స్ వినిపించాయి. ఇదే చిత్రాన్ని థియేటర్లలో కనుక విడుదల చేసి ఉంటే బయ్యర్స్ కు భారీ నష్టాలు వాటిల్లేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రీకరణ తుది దశలో ఉండగా.. ఆ చిత్రం దర్శకుడు కొండా విజయ్ కుమార్ తో మరో చిత్రం చెయ్యడానికి ఓకే చెప్పేశాడట హీరో రాజ్ తరుణ్.
ఓ ఎన్నారై నిర్మాత ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకు వచ్చాడట. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టేసారు. అయితే ఇప్పుడు ‘ఒరేయ్ బుజ్జిగా’ ఫలితం తేడా కొట్టింది. దాంతో రాజ్ తరుణ్- కొండా విజయ్ కుమార్ ల కొత్త సినిమా నిర్మిస్తున్న నిర్మాత టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇది కేవలం రాజ్ తరుణ్ తొందర పాటు వల్లే జరిగిందని అతను భావిస్తున్నట్టు కూడా ఇన్సైడ్ టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి