భారీ అంచనాలతో కెమెరాముందుకొచ్చిన అఖిల్, ఇప్పటివరకు ఆ అంచనాలు అందుకోలేకపోయాడు. అక్కినేని ఫ్యాన్స్ ఊహిస్తోన్న రేంజ్కి రీచ్ కాలేకపోయాడు. ఇక అఖిల్ కూడా మాస్ హీరోగా ఎదగాలని చాలా ట్రై చేస్తున్నాడు గానీ వర్కవుట్ కావడం లేదు. పైగా వరుస ఫ్లాపులతో స్లంపులో పడిపోయాడు అక్కినేని ప్రిన్స్.
డౌన్ఫాల్లో ఉన్న కెరీర్ని కాపాడుకోవడానికి హీరోయిన్ల గ్లామర్ని నమ్ముకుంటున్నాడట అఖిల్. యూత్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్లని తీసుకుంటే బిజినెస్ అవుతుందని, మార్కెట్ కలిసొస్తుందనే ఆలోచనలో ఉన్నాడట అఖిల్. అందుకే ఎక్కువగా టాప్ హీరోయిన్స్ని ప్రిఫర్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు సినీజనాలు.
అఖిల్ ఇప్పుడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో టాప్ హీరోయిన్ పూజా హెగ్డేతో రొమాన్స్ చేస్తున్నాడు అఖిల్. ఇక ఈ సినిమా తర్వాత చేయబోయే సురేందర్ రెడ్డి మూవీకి రష్మిక మందన్నాని తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు టాప్ హీరోయిన్స్ని తీసుకోవడంతో అక్కినేని ప్రిన్స్ హీరోయిన్ల గ్లామర్పై డిపెండ్ అవుతున్నాడనే విమర్శలొస్తున్నాయి.
ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అఖిల్.. ఆ ఇమేజ్ ను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం ఏదేదో అనుకుంటున్నారు.. కానీ ఆ అంచనాలకు తమ అభిమాన హీరో చేరుకోలేకపోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అఖిల్ కూడా మాస్ హీరోగా ఎదగాలని చాలా ప్రయత్నిస్తున్నా.. అనుకుంది జరుగడం లేదు. పైగా వరుస డిజాస్టర్స్ తో కెరీర్ లో నిలదొక్కకుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కినేని అఖిల్. చూద్దాం.. అఖిల్ భవిష్యత్తులో ఏమైనా.. మార్పులు చేసుకుంటాడేమో.