అల వైకుంఠపురంలో విడుదల తర్వాత త్రివిక్రమ్ ఎవరిని డైరెక్ట్ చేస్తాడన్న ఆసక్తి నెలకొంది. తమ హీరోతో చేస్తే బాగుటుందని అభిమానుసు ఇంట్రెస్ట్ చూపించగా.. ఆ అవకాశం ఎన్టీఆర్ అభిమానులకు దక్కింది. టైటిల్ ఇంకా ఎనౌన్స్ చేయకపోయినా.. 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ రిజిష్టర్ చేయించారు. ఇంతలో కరోనా రావడం... ఆర్ఆర్ఆర్ షూట్ ఆగిపోవడంతో... త్రివిక్రమ్ సినిమా మొదలు కాలేదు.
ఆగస్ట్లో ఆర్ఆర్ఆర్ షూట్ మొదలవుతుంది.. డిసెంబర్ నాటికి రాజమౌళి మూవీ నుంచి తారక్ బైట కొచ్చేస్తాడనుకున్నారు. ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ షూట్ పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ పూర్తయ్యేవరకు మరో మూవీ చేసేది లేదని తారక్ చెప్పేశాడట. ఈలోగా త్రివిక్రమ్ మరో మూవీ చేయడానికి ప్లాన్ చేశాడు. స్టార్స్ అందరూ బిజీగా వుండడంతో... యంగ్ హీరో రామ్తో సినిమా చేస్తాడనేది ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్, త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఉషాకిరణ్ మూవీస్తో కలిసి రవికిషోర్ నిర్మించిన 'నువ్వే కావాలి' మూవీకి త్రివిక్రమ్ మాటలు రాశారు. ఆ తర్వాత సురేష్ మూవీస్తో కలిసి స్రవంతి మూవీస్ తీసిన 'నువ్వునాకునచ్చావ్'కు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. ప్రస్తుతం హాసిని హారిక క్రియేషన్స్తో వరుస సినిమాలు తీస్తున్న త్రివిక్రమ్.. స్రవంతి రవికిషోర్తో కలిసి ఓ మూవీ చేస్తారని సమాచారం. స్రవంతి మూవీస్ బేనర్లో సినిమా అంటే రామే హీఅరో. రామ్ నటించిన రెడ్ రిలీజ్కు రెడీగా వుంది. మరో సినిమా కమిట్ కాలేదు. ఈలెక్కన త్రివిక్రమ్ డైరెక్షన్ చేసే బంపర్ ఆఫర్ రామ్కు దక్కుతుందో లేదో చూడాలి.