సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాను శనివారం హైదరాబాద్ కెపిహెచ్బి టెంపుల్ లో ముహుర్త కార్యక్రమాలు జర్పుకున్నారు. ఎప్పటిలానే తన సెంటిమెంట్ గా కేవలం నమ్రతని మాత్రమే ముహుర్తానికి పంపించాడు మహేష్. సితార కూడా సినిమా పూజలో పాల్గొంది.

సర్కారు వారి పాట పూజ జరిగిన టైం లో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేని డైరక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. పరశురాం కు అత్యంత సన్నితుడైన పూరీ సర్కారు వారి పాట పూజ జరిగిన విషయంపై ట్వీట్ చేస్తూ పరశురాం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేకాదు ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ కు మరో సూపర్ హిట్ ఇస్తుందని చెప్పాడు. మహేష్, పూరీ ఇద్దరి కాంబినేషన్ లో పోకిరి, బిజినెస్ మెన్ సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మహేష్ తో పూరీ హ్యాట్రిక్ మూవీ జనగణమన ప్లాన్ చేశాడు. అయితే మహేష్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాను హోల్డ్ లో పెట్టాడు. మహేష్ లేట్ చేస్తున్న కారణంగా పూరీ జగన్నాథ్ ఆ సినిమాను వేరే హీరోతో చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: