చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్ళకుండా...పక్క ప్లానింగ్ తో తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రజల్లో ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. అదే ప్రేరణతో మరెన్నో సినిమాలు చేయాలని ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. ఇప్పుడు వరుస హిట్ సినిమాల దర్శకుడు కొరటాల శివతో చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తయి సినిమా విడుదల కావాల్సింది, కానీ మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం వలన అన్ని పనులు వెనుకబడిపోయాయి.

దీనితో షూటింగ్ చాలా ఆలస్యమయింది. ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగైంది కాబట్టి మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టారు. అయితే చిరంజీవి పార్ట్ వరకు చిత్రీకరణ జరుపుతున్నారు, ఎందుకంటే కాజల్ అగర్వాల్ ఇటీవలే పెళ్లి చేసుకుని హనీ మూన్ లో ఉంది. అలాగే రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీతో బిజీ గా ఉండడంతో, తన షూటింగ్ పెండింగ్ లో ఉంది. దీనికి కూడా రామ్ చరణ్ డేట్స్ ఇచ్చారని చిత్ర యూనిట్ తెలిపినది. సంక్రాంతి అయిపోయిన వెంటనే ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు.

అంతేకాకుండా రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ భాగాన్ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేస్తారని చెప్పడంతో, అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.  మరియు చిరు రామ్ చరణ్ లకు ఉన్న ఎపిసోడులను కూడా ఏకకాలంలో పూర్తి చేస్తారని చెప్పారు. అటు కాజల్ కూడా డిసెంబర్ లో చిత్ర యూనిట్ ని కలవబోతోంది. ఇప్పటికే రాజమౌళి తో కలిసి మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు. ఈ సినిమాను 2021 వేసవి కాలంలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను చేసుకుంటోంది చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: