రాజకుమారుడు సినిమాతో వెండితెరకు పరిచయమై కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. తన అద్బుతమైన నటన ద్వారా మహేశ్ బాబు ఎన్నో అవార్డులు, రివార్డులను కైవసం చేసుకున్నారు. 2003 లో నిజం సినిమాకు మహేశ్  మొదటిసారిగా నంది ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ తన ప్రతిభను కనభరుస్తున్నాడు ఈ శ్రీమంతుడు. రీల్లో హీరోలుగా ఉన్నా రియల్ లైఫ్ లో హీరోలు ఉండటం కష్టమంటారు. కాని అదినిజం కాదని సినీ నటులు నిరూపించుకుంటూ ఉంటారు. సినిమాల్లోనే  కాకుండా నిజ జీవితంలో కూడా హీరోయిజాన్ని బయటపెడుతూ పేదలకు సాయపడుతూ ఉంటారు. 


అందులోనూ పేదలకు హర్ట్ సర్జరీలు చేయించడంలో ఈ హీరో ఎప్పుడూ ముందుంటారనే విషయం అందరికీ తెలిసిందే.  తాజాగా మరొక చిన్నారికి హర్ట్ సర్జరీ చేయించి ఆ పాపకు కొత్త జీవితాన్ని అందించాడు మహేష్. ఈ హీరోకు అండగా తన భార్య నమ్రత ఉంటుందట. అందులోనూ ఆ సర్జరీలకు సంబంధించిన సహాయాలన్నింటినీ నమ్రతే దగ్గరుండి మరీ చూసుకుంటుందట. తాజాగా డింపుల్ అనే చిన్నారి పల్మ్ వాల్వ్ స్టెనోసిస్ తో, కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో పోరాడుతోంది. 


ఈ చిన్నారికి సూపర్ స్టార్ మహేశ్ ట్రీట్ మెంట్ ఇప్పించాడు. ప్రస్తుతం ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి మునపటి కంటే చాలా బాగుందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ సతీమణి నమ్రత కూడా డింపుల్ ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేసింది.  ఇలా పిల్లలకు, వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయపడటం సంతోషంగా ఉందని నమ్రత తెలిపారు. 


ఎంబీఫర్ సేవింగ్ హార్ట్స్.. అనే హ్యాష్ ట్యాగ్ తో ‘ ఆంధ్రాస్పత్రుల్లో మరో అద్బుతమైన రికవరీ.. తవ్రమైన పల్మ్ వాల్వ్ స్టెనోసిస్ తో, కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ తో పోరాడుతున్న డింపుల్ ఆరోగ్యం మునపటి కంటే మెరుగైంది. ఆ చిన్నారికి, వారి కుటుంబానికి నా బ్లెస్సింగ్స్’ అంటూ నమ్రత  చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: