సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలో మహేష్ తో పాటు మొదటిసారి రొమాన్స్ చేస్తుంది కీర్తి సురేష్. పొలిటికల్ సేటైర్ గా వస్తున్న ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ ను ఢీ కొట్టే విలన్ ఎవరన్నది నిర్ణయించలేదు.

బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ కపూర్, కోలీవుడ్ హీరో అరవింద స్వామి ఇద్దరిలో ఒకరు మహేష్ తో విలన్ గా నటిస్తాడని తెలుస్తుంది. మహేష్ కు విలన్ అంటే ఆ రేంజ్ వేరేలా ఉండేది. ఇక మహేష్ విలన్ గా వారిద్దరిలో ఎవరన్నది త్వరలో తెలుస్తుందట. మహేష్ క్యారక్టర్ కు ధీటుగా విలన్ పాత్ర ఉంటుందని. పరశురాం విలన్ రోల్ ను స్పెషల్ గా ప్లాన్ చేశాడట.

అయితే అనీల్ కపూర్, అరవింద స్వామి ఇద్దరిలో ఎవరైనా సరే సూపర్ గా ఉంటారని చెప్పొచ్చు. మహేష్ తప్పకుండా ఈ సినిమాతో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. సూపర్ స్టార్ స్టామినా చాటేలా సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది.                         

మరింత సమాచారం తెలుసుకోండి: