టాలీవుడ్ క్రేజీ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఒకరు. తారక్ నట విశ్వరూపం చూపిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.. నందమూరి ఫ్యాన్స్ విజిల్స్ వేయాల్సిందే. తను చేసే సినిమాల్లో ది బెస్ట్ ఇస్తూ వస్తున్న ఎన్.టి.ఆర్ కేవలం వెండితెర మీదే కాకుండా స్మాల్ స్క్రీన్ మీద కూడా సత్తా చాటుతున్నాడు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ గా చేసిన ఎన్.టి.ఆర్ ఆ షోతో స్క్రీన్ ఏదైనా తను చెలరేగిపోవడం పక్కా అని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక లేటెస్ట్ గా జెమిని టివి కోసం స్పెషల్ రియాలిటీ షో చేస్తున్నాడట ఎన్.టి.ఆర్. మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో ఈ షో ఉంటుందని టాక్. ఎం.ఈ.కే మూడు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకోగా జెమిని టివితో కొత్తగా అదే తరహాలో ఓ రియాలిటీ షో వస్తుందని తెలుస్తుంది. ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నందుకు ఎన్.టి.ఆర్ కు భారీ పారితోషికం ఇస్తున్నారట. దాదాపు ఎపిసోడ్ కు 30 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

స్మాల్ స్క్రీన్ పై తారక్ షో చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. తప్పకుండా ఈ షో రేంజ్ వేరే లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్.టి.ఆర్.. ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా సత్తా చాటాలని చూస్తున్నాడు తారక్. ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రం తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు ఎన్.టి.ఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: