కరోనా కారణంగా ఇన్నాళ్లు మూతపడిన థియేటర్ల బూజు దులుపుతూ మెగా ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. కోవిడ్ కష్టాలలో ఉన్న ప్రేక్షకులు థియేటర్స్‌లోకి  వస్తారా? వచ్చినా ఎంతమంది వస్తారు..??  అనే అనుమానాలను తన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు తేజ్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మొదటి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లను రాబడుతోంది. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ ప్రధాన పాత్రలో మెరిసింది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో  ఆర్ నారాయణ మూర్తి పరోక్షంగా కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ నటన అద్భుతం అంటూ.... అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఆనంద సమయంలో థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. థాంక్స్ మీట్ కు విచ్చేసిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ... ఈ సినిమా సందిగ్ధంలో ఉన్న థియేటర్స్ తెరుచుకోవడానికి భరోసా ఇచ్చింది. మళ్లీ సినిమాలు తిరిగి థియేటర్లో రిలీజ్ కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు.

కానీ కరోనా కష్ట సమయంలో సినీ పరిశ్రమ కష్టాలు పడుతోంది. ఇటు ప్రేక్షకులు సైతం కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో ఒకరికొకరు సహాయపడాలి... ప్రేక్షకులు ఇబ్బంది పడే విధంగా పెద్ద సినిమాల వారు టికెట్ల రేట్లు పెంచకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిగా మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ విధంగా టికెట్ల రేట్లను పెంచొద్దు అని మీడియా ముఖంగా తెలియచేయడంతో డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ యాజమాన్యం ఏవిధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: